మార్కు 3:31-35లో , యేసుక్రీస్తు సహోదరులు, ఆయన తల్లియైన మరియ వచ్చారని వారు యేసును వెదకుచున్నారని యేసుతో చెబుతారు. అప్పుడు యేసు, తన చుట్టూ కూర్చున్న వారిని చూచి “ఇదిగో నా తల్లి, నా సహోదరులు. దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడు, నా సహోదరియు, నా తల్లి” అని చెప్పాడు. ఈ మాటలు చదివినపుడు, యేసుక్రీస్తు తన తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదని మనకు అనిపించొచ్చు. అంతేకాదు, ఎవరైనా తనను వెంబడించాలనుకుంటే తన తల్లినైనను, తండ్రినైనను, సహోదరులనైనను, సహోదరీమణులను, తన స్వంత ప్రాణమునైనను విడిచిపెట్టి, తన సిలువనెత్తుకుని వెంబడించకుంటే,వారు నా శిష్యులు కానేరరు (లూకా 14:26,27) అని చెప్పడం కూడా చూస్తాం. ఈ మాటలు చదివినపుడు, యేసుక్రీస్తు ప్రభువు, తనను ఎవరైనా వెంబడించాలంటే తల్లిదండ్రులను విడిచిపెట్టమని చెప్పినట్లుగా మనకు అనిపించొచ్చు. కానీ, క్రీస్తు చెబుతున్న విషయం అది కాదు. క్రీస్తే స్వయాన తన తల్లిదండ్రులతో కలిసి ముప్పై సంవత్సరాలు వారికి లోబడి జీవించాడు (లూకా 2:51). మార్కు 3:31-35లో, క్రీస్తు చెప్పదల్చుకున్న ప్రాముఖ్యమైన సంగతి ఏమిటంటే, ఎవరైతే దేవ...
మూడు రోజుల క్రితం నాకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. నేను డాక్టర్ అవ్వడం వలన, అది నా కిడ్నిలో గల రాళ్ల వలన వచ్చిందని కొంతవరకు నాకు అర్థమయ్యింది. వెంటనే కొన్ని ఇంజెక్షన్స్ తీసుకున్నాను. రెండు మూడు గంటల్లో నొప్పి తగ్గింది. మరుసటి రోజు CT SCAN చేయిస్తే ఒకవైపు మూత్రనాళంలో రాయి ఉందని తెలిసింది. 6-7mm పరిమాణం గల చిన్న రాయి నన్ను తీవ్రమైన నొప్పికి గురిచేసింది. ఆ సమయంలో ఒక చిన్న పిల్లాడిలా బెడ్ మీద అటు ఇటు దొర్లడం కూడా నాకు గుర్తుంది. కడుపులో నొప్పి తగ్గగానే దేవుడు నా హృదయంలో పెట్టిన రెండు ఆలోచనలు ఏమిటంటే, ఒక చిన్న రాయి కలగజేసిన నొప్పికే నేను విలవిలలాడిపోయానే, ప్రభువైన క్రీస్తు ఆ సిలువలో నాకోసం ఎంతగా నొప్పిని భరించి ఉంటాడో కదా! నా పాప శిక్షను మోసిన క్రీస్తు అనుభవించిన నొప్పి వేదన ఎంత తీవ్రమైనదో కదా! అంతేకాదు, ఒక చిన్న రాయి నా శరీరంలో కలగజేసిన నొప్పికే నేను తట్టుకోలేకపోయాను. రక్షించబడకుండా నేను మరణిస్తే అగ్ని ఆరని పురుగు చావని నిత్య నరకంలో ఎప్పటికీ విపరీతమైన వేదన బాధతో ఉండిపోయేవాణ్ణి. నరకవేదన నుండి నన్ను తప్పించిన దేవుడు నా పట్ల చూపిన ప్రేమ ఎంత గొప్పదో కదా! అందుకే కాబ...