Skip to main content

Posts

యేసుక్రీస్తు vs తల్లిదండ్రులు

మార్కు 3:31-35లో ,  యేసుక్రీస్తు సహోదరులు, ఆయన తల్లియైన మరియ వచ్చారని వారు యేసును వెదకుచున్నారని యేసుతో చెబుతారు. అప్పుడు యేసు, తన చుట్టూ కూర్చున్న వారిని చూచి “ఇదిగో నా తల్లి, నా సహోదరులు. దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడు, నా సహోదరియు, నా తల్లి” అని చెప్పాడు.  ఈ మాటలు చదివినపుడు, యేసుక్రీస్తు తన తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదని మనకు అనిపించొచ్చు.    అంతేకాదు, ఎవరైనా తనను వెంబడించాలనుకుంటే తన తల్లినైనను, తండ్రినైనను, సహోదరులనైనను, సహోదరీమణులను, తన స్వంత ప్రాణమునైనను విడిచిపెట్టి, తన సిలువనెత్తుకుని వెంబడించకుంటే,వారు నా శిష్యులు కానేరరు (లూకా 14:26,27) అని చెప్పడం కూడా చూస్తాం.  ఈ మాటలు చదివినపుడు, యేసుక్రీస్తు ప్రభువు, తనను ఎవరైనా వెంబడించాలంటే తల్లిదండ్రులను విడిచిపెట్టమని చెప్పినట్లుగా మనకు అనిపించొచ్చు.    కానీ, క్రీస్తు చెబుతున్న విషయం అది కాదు. క్రీస్తే స్వయాన తన తల్లిదండ్రులతో కలిసి ముప్పై సంవత్సరాలు వారికి లోబడి జీవించాడు (లూకా 2:51).    మార్కు 3:31-35లో, క్రీస్తు చెప్పదల్చుకున్న ప్రాముఖ్యమైన సంగతి ఏమిటంటే, ఎవరైతే దేవ...
Recent posts

కిడ్నీలో రాయి - క్రీస్తే మూలరాయి

మూడు రోజుల క్రితం నాకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. నేను డాక్టర్ అవ్వడం వలన, అది నా కిడ్నిలో గల రాళ్ల వలన వచ్చిందని కొంతవరకు నాకు అర్థమయ్యింది. వెంటనే కొన్ని ఇంజెక్షన్స్ తీసుకున్నాను. రెండు మూడు గంటల్లో  నొప్పి తగ్గింది.  మరుసటి రోజు CT SCAN చేయిస్తే ఒకవైపు మూత్రనాళంలో రాయి ఉందని తెలిసింది. 6-7mm పరిమాణం గల చిన్న రాయి నన్ను తీవ్రమైన నొప్పికి గురిచేసింది. ఆ సమయంలో ఒక చిన్న పిల్లాడిలా బెడ్ మీద అటు ఇటు దొర్లడం కూడా నాకు గుర్తుంది.   కడుపులో నొప్పి తగ్గగానే దేవుడు నా హృదయంలో పెట్టిన రెండు ఆలోచనలు ఏమిటంటే, ఒక చిన్న రాయి కలగజేసిన నొప్పికే నేను విలవిలలాడిపోయానే, ప్రభువైన క్రీస్తు ఆ సిలువలో నాకోసం ఎంతగా నొప్పిని భరించి ఉంటాడో కదా! నా పాప శిక్షను మోసిన క్రీస్తు అనుభవించిన నొప్పి వేదన ఎంత తీవ్రమైనదో కదా! అంతేకాదు, ఒక చిన్న రాయి నా శరీరంలో కలగజేసిన నొప్పికే నేను తట్టుకోలేకపోయాను. రక్షించబడకుండా నేను మరణిస్తే అగ్ని ఆరని పురుగు చావని నిత్య నరకంలో ఎప్పటికీ విపరీతమైన వేదన బాధతో ఉండిపోయేవాణ్ణి. నరకవేదన నుండి నన్ను తప్పించిన దేవుడు నా పట్ల చూపిన ప్రేమ ఎంత గొప్పదో కదా!  అందుకే కాబ...

విడిచిపెట్టాల్సినవేమిటో?

దేవుడు అబ్రామును పిలిచినప్పుడు " నీవు లేచి నీ దేశమునుండియు నీ బంధువులయొద్దనుండియు నీ తండ్రి యింటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్లుము" (ఆది 12:1) అని ఆజ్ఞాపించాడు. దేవుడు ఇక్కడ అబ్రాముతో మనవి చేయట్లేదు, ఆజ్ఞాపిస్తున్నాడు. సార్వభౌముడైన సర్వశక్తిమంతుడైన దేవుడు అబ్రాముకు ఆజ్ఞను జారీచేస్తున్నాడు. అబ్రాము, నీ దేశం విడిచిపెట్టు, నీ బంధువులను విడిచిపెట్టు, ఇక్కడి నుండి బయలుదేరు అన్నట్లుగా ఆ ఆజ్ఞ మనకి కనిపిస్తుంది. అబ్రాము బహుశా అక్కడే పుట్టుంటాడు, అక్కడే పెరిగి ఉంటాడు, అక్కడే చంద్రుణ్ణి ఆరాధించే భక్తిని నేర్చుకుని ఉంటాడు. అన్యదేవతలను పూజిస్తున్న కుటుంబంలో నుండి  “అబ్రాము, నువ్వు వారికి వేరుగా ఉండాలి, ఈ ప్రాంతానికి వేరుగా వేరే ప్రాంతానికి వెళ్లాలి” అని దేవుడు చెప్పాడు. అదే దేవుడు అటువంటి పరిస్థితులు ఉన్న ప్రస్తుత సమాజం నుండి ఇప్పటికీ ప్రజలను పిలుస్తున్నాడు. అబ్రామును పిలిచినట్లుగా అతనితో సూటిగా మాట్లాడి పిలవడం లేదు కానీ, ఈ దినములలో తన కుమారుడైన క్రీస్తు ద్వారా రక్షణ కోసం మనల్ని పిలుస్తున్నాడు (హెబ్రీ 1:1,2).   యేసుక్రీస్తు ప్రభువు తన పరిచర్యలో ఆ పిలుపును మార్కు ...

క్రైస్తవులు బాధపడడం, ఏడ్వడం తప్పా?

అది ఆదివారం. సంఘ ఆరాధనలో జాన్ కనిపించకపోయేసరికి డేవిడ్ ఆరాధన అవ్వగానే జాన్ ఇంటికి వెళ్లాడు.   జాన్ చాలా కృంగిపోయి తన జీవితంలో ఎదురవుతున్న శ్రమలను గురించి డేవిడ్ తో పంచుకున్నాడు. జాన్ బాధను చూసిన డేవిడ్ ఏ మాత్రం తడబడకుండా  “ మనం క్రీస్తుశిష్యులం ,  దేవుడు లేనివారిలా అలా బాధపడతావేంటి? క్రైస్తవులు బాధపడొద్దు, పిరికివాళ్లలా ఏడవద్దు ”  అని సూటిగా చెప్పాడు .  ఇలా చెప్పడం సరైనదిగానే అనిపించినప్పటికీ క్రైస్తవులు కృంగిపోవడం ,  బాధల్లో ఏడవడం తప్పు అనే విధంగా డేవిడ్ మాటలున్నాయని మనకు అర్థమౌతుంది. సంఘాల్లో కూడా మనకు తెలియకుండానే ఇటువంటి బోధ కూడా జరగడం నేను గమనించాను. మనుషుల ఎమోషన్స్ మీద సరైన అవగాహన లేకపోవడం వలన బాధల్లో ఉన్నవారికి ఆత్మీయంగా చెడ్డ మాటలు చెప్పకపోయినా, ఆ భావోద్వేగాలు వ్యక్తపర్చడం కూడా తప్పే అనే తత్వం తరచుగా మనకు కనిపిస్తుంది. క్రైస్తవులకు, దేవుని వాక్యం మీద కాస్త జ్ఞానం లభించగానే ఇతర మనుషుల భావోద్వేగాల వాస్తవికతను మర్చిపోతారేమో అని నాకు అనిపిస్తుంటుంది.    దేవుడు భావోద్వేగాలు గల వ్యక్తి  దేవుడు భావోద్వేగాలు కలిగినవాడని బైబిల్ గ్రంథం మనకు బోధ...

ఈ మాటలు మననం చేసుకో

2 కొరిం 5:15 - "జీవించువారికమీదట తమకొరకు కాక ,   తమ నిమిత్తము మృతిపొంది తిరిగి లేచినవాని కొరకే జీవించుటకు ఆయన అందరికొరకు మృతిపొందెననియు నిశ్చయించుకొనుచున్నాము". దేవుడు తన మహా కృపలో నిన్ను నన్ను రక్షించాడు.  రక్షించబడిన మనం మన క్రైస్తవ జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు మళ్లీ జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను :  1. ఎందుకు బ్రదుకుతున్నావో జ్ఞాపకం చేసుకో  – క్రీస్తును మహిమ పర్చడానికి,ఆయన సువార్తను ప్రకటించడానికి, ఆయన కుమారుడిగా కుటుంబంలో సంఘంలో సమాజంలో జీవించడానికి మనం రక్షించబడ్డాం అని మర్చిపోవద్దు.  2.  అనవసరమైనవాటిని వదులుకో –  మనల్ని క్రీస్తు నుండి దూరం చేసేవాటిని, క్రీస్తు నుండి మనల్ని దూరం చేసే మనుషులను వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలి.  క్రీస్తులో గల రక్షణానందం నుండి వేరు చేసే పాపాన్ని, ఆ పాపాన్ని ప్రోత్సహించే మనుషులను సైతం విడిచిపెట్టాలి.  3.  అందరినీ సంతోషపెట్టడం సాధ్యం కాదని తెలుసుకో –  ప్రభువు మనకిచ్చిన ఆజ్ఞలు, బాధ్యతలు నెరవేర్చాలంటే, కుటుంబానికి సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండాలంటే అందరినీ సంతోషపెట్టడం కుదరదని...

అసూయ వలన కలిగే అనర్థము

  1 సమూయేలు పుస్తకంలో దావీదు గొల్యాతును చంపే సన్నివేశం బైబిల్ మొత్తంలో ఒక అద్భుతమైన దేవుని కార్యంగా మనకు కనిపిస్తుంది. ఒక బాలుడు యుద్ధంలో వాడే యుద్ధోపకరణాలు వాడకుండా ఒక యుద్ధశూరుణ్ణి చంపడం కేవలం దేవుని శక్తి వలననే సాధ్యం అని ఈ కథ మనకు బోధిస్తుంది. ఈ కథను ఎన్నో సార్లు మనం వినుంటాం, చదివుంటాం. అయితే, ఆ తర్వాత జరిగిన విషయాలను కూడా మనం ధ్యానించాల్సిన అవసరం ఉంది.  1సమూ 18:7లో ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు సౌలు వేల కొలదియు దావీదు పదివేల కొలదియు శత్రువులను హతము చేసిరనిరి.  ఎప్పుడైతే దావీదు గొల్యాతును చంపి పట్టణంలోకి ప్రవేశించాడో ప్రజలు ఇలా చెప్పడం సౌలుకు అసూయను కలిగించింది.  దావీదు అంతకుముందు నుండే సౌలు దగ్గరికి వచ్చి సితారా వాయిస్తూ దురాత్మ నుండి సౌలుకు ఉపశమనం కలిగించేవాడు  (1సమూ 16:23). అంటే సౌలు, దావీదు ద్వారా వ్యక్తిగతంగా ఆశీర్వదించబడ్డాడు. సౌలు,  గొల్యాతుతో యుద్ధం చేయడానికి భయపడ్డాడు  (1సమూ 17:11).  సౌలు, ఎవరైనా  గొల్యాతును ఓడిస్తే తన ఐశ్వర్యం ఇచ్చి, ఆ వ్యక్తికి తన కూతురిని ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటించాడు  (1సమూ 17:25). అంటే, సౌలుక...

బిగ్ స్క్రీన్ పరిచర్య

  ఈ మధ్య కొంతమంది తమ్ముళ్లలతో మాట్లాడుతుంటే బయట జరుగుతున్న సంఘ కార్యక్రమాలను గురించి వారు చెప్పిన మాటలు నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేశాయి. ఒక సంఘ కాపరి, పరిచర్య నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లినప్పుడు తన స్థానిక సంఘంలో వేరే ప్రసంగీకుణ్ణి సిద్ధపర్చకుండా, ఎప్పుడో చెప్పిన ప్రసంగం వీడియో స్క్రీన్ మీద వేశారట. ఇలా చాలా సార్లు జరుగుతుందని కూడా వాళ్లు చెప్పినపుడు, ఆ సంఘ విశ్వాసుల ఆత్మీయ స్థితిని గురించి నాకు బాధేసింది.  ఆదిమ సంఘంలో నాయకులు సంఘంతో ఉన్నారు, సంఘానికి బోధించారు, సంఘాన్ని దేవుని వాక్యంతో కౌన్సిలింగ్ చేశారు. సంఘ చరిత్రలో కూడా నాయకులు ఇదే విధమైన పరిచర్య చేశారు. కానీ నేడు, పరిచర్యలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.  సంఘంలో వేరే నాయకుణ్ణి లేదా ప్రసంగీకుణ్ణి కూడా సిద్ధపరచని నాయకుడు, తన సంఘం మీద తానే నియంత్రణ కలిగుండాలి అనే తత్వాన్ని కలిగుండడమే అని నా అభిప్రాయం. ఆయన తప్ప ఎవరూ కూడా ఆ స్థానం తీసుకోవద్దు అనే ఆలోచనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోడానికి కారణం అవుతుంది.  సంఘముగా కూడినప్పుడు వినిపించబడే దేవుని వాక్యం, ముందుగానే రికార్డ్ చేసి, ఒక పెద్ద స్క్రీన్ మీద అందరికీ చూపించడం బహు...