Skip to main content

సంఘం మరియు సువార్త - శిష్యత్వం - సంఘ స్థాపన

"మా తల్లిదండ్రులు ఇదే సంఘ సభ్యులు నేను ఈ సంఘంలోనే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే సభ్యత్వం తీసుకున్నాను, ఇక ఇక్కడే బ్రదర్". ఇవి ఒక క్రైస్తవ సోదరుని మాటలు.

ఒకవేళ ప్రతి క్రైస్తవుడు ఇలానే ఆలోచిస్తే క్రీస్తు పరలోకానికి ఆరోహణమై వెళుతూ తన శిష్యులకిచ్చిన ప్రధానమైన,గొప్ప ఆజ్ఞ (మత్తయి 28:19,20) ఎలా నెరవేరుతుంది ? 
బాప్తీస్మమిచ్చుచూ, బోధించుచూ,సమస్త ప్రజలను నా శిష్యులుగా చేయండి అనే ఆజ్ఞ కేవలం నాయకులకు మాత్రమే కాదు క్రీస్తుని విశ్వసించిన ప్రతి వ్యక్తికి అని తెలుసుకోవాలి.

మరోవైపు ఈ ఆజ్ఞను లోతుగా పరిశీలిస్తే, క్రీస్తు శిష్యులకిచ్చిన ఈ గొప్ప ఆజ్ఞ, సంఘ స్థాపన వైపు ప్రోత్సహించే విధంగా అర్థమవుతుంది. ఎందుకంటే స్థానిక సంఘ సందర్భంలోనే బాప్తీస్మం ఇవ్వడం క్రీస్తు బోధలను బోధించడం తద్వారా క్రీస్తు శిష్యులను తయారు చేయడం జరుగుతుంది కాబట్టి.

పారా చర్చ్ సంస్థలు శిష్యత్వపు తర్ఫీదు అని టీచింగ్ చేయగలరు కానీ, బాప్తీస్మం ఇవ్వడం, పాస్టర్ల లాగా విశ్వాసుల ఆత్మీయ జీవితాలను పర్యవేక్షించడం చేయలేరు. క్రీస్తు సంఘం కొరకు తన ప్రాణం పెట్టాడు, పారా చర్చ్ సంస్థల కొరకు కాదు. పౌలు సంఘాలకు ఉత్తరాలు రాశాడు, పారా చర్చ్ సంస్థలకు కాదు.
క్రీస్తు సంఘం కొరకు మరల వస్తున్నాడు, పారా చర్చ్ సంస్థల కొరకు కాదు. 
అలాగని, పారా చర్చ్ సంస్థల పనిని తక్కువ చేయాలని కాదు. ఒక రకంగా సంఘం చేయాల్సిన పని చేయలేక పోయినందునే, పారా చర్చ్ సంస్థలు ఈ శిష్యత్వపు పనిని భుజాన వేసుకుంది. 
వీటి వల్ల ఎంతో మందిని ప్రభువు రక్షించాడు. దేవునికి స్తోత్రం. కానీ, వాక్యం సంఘానికి ఈ ఆజ్ఞ ఇచ్చిందని మర్చిపోకూడదు.
అందుకే, పారా చర్చ్ సంస్థలు సంఘానికి కింద లేదా సంఘంతో చేతులు కలిపి పని చేయాలి. సంఘానికి వేరుగా ఉంటూ, సంఘ పరిచర్యకి పోటీగా పరుగెత్తే పారా చర్చ్ సంస్థలు ఆరోగ్యకరమైనవి కావు.

క్రీస్తు సువార్త సమస్త ప్రజలకు చేరాలంటే సంఘంలో ఉన్నవారు సువార్త పంచాలి, సంఘము శిష్యులను,నాయకులను తయారుచేయాలి,సంఘము కొత్త సంఘాలను స్థాపించాలి. 
అపొస్తలుల కార్యముల పుస్తకంలో పెంతెకొస్తు దినాన జరిగింది అదే.
సువార్త విన్న 3,000 మంది శిష్యులతో కలిశారు,ఆ తర్వాత బోధలో, ప్రార్థనలో, రొట్టె విరుచుటలో,సహవాసంలో ఎడతెగక ఉన్నారు అంటే సంఘంగా కలిసి జీవించడం ఆరంభించారు.
ఈ గుంపు అక్కడక్కడ చెదిరి సంఘాలుగా కలవడం మొదలుపెట్టారు. 
పౌలు తన మిషనరీ ప్రయాణాల్లో వివిధ ప్రదేశాల్లో సువార్త పంచి, సంఘాన్ని స్థాపించి నాయకులను నియమించి మత్తయి 28:19,20 ని నెరవేర్చాడు.

మన రాష్ట్రంలో మన దేశంలో సువార్త వెదజల్లబడాలని ప్రార్థన చేస్తున్నామా? మంచిదే కానీ, మరోవైపు సంఘానికి, నూతన సంఘాలను స్థాపించే దేవుడిచ్చిన ఆజ్ఞను నిర్లక్ష్యం చేస్తున్నామా? 
ఒకసారి ప్రశ్నించుకుంటే మంచిది.

- డా.శంకర్ బాబు 

Comments

Post a Comment

Popular posts from this blog

సత్యం కోసం నిలిచిన చార్లీ కర్క్

అమెరికాలో ఇటీవల చోటుచేసుకున్న ఒక విషాద సంఘటన, అందరి హృదయాలను కలిచివేసింది. చార్లీ కర్క్ అనే యవ్వనస్తున్ని, ఆయనకన్నా చిన్న వయసున్న మరొక యువకుడు అందరి ముందు ఒక సమావేశంలో కాల్చి చంపాడు. చార్లీ కర్క్ ఒక క్రైస్తవుడు. దేవుని వాక్యాన్ని విశ్వసించి, ఆచరించి, దేవుని కోసం జీవించాడు. వివిధ యూనివర్సిటీల్లో యువతతో సమావేశమై, వారికి జీవిత పాఠాలను బోధించాడు. దేవుని సత్యాలను స్పష్టంగా తెలియజేశాడు. యువకులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి, వారిని నిజమైన విశ్వాస మార్గంలో నడిపేందుకు కృషి చేశాడు. బైబిల్ వ్యతిరేకమైన సిద్ధాంతాలను, జీవన విధానాలను ధైర్యంగా ఖండించాడు. తన చిన్న వయసులోనే ఎంతోమంది అభిమానాన్ని గెలుచుకుని, యువతకు ఆదర్శంగా నిలిచాడు. కుటుంబ బాధ్యతలను నెరవేర్చుకుంటూనే సమాజంలో మార్పు కోసం శ్రమించాడు. అబార్షన్‌కు వ్యతిరేకంగా గళమెత్తాడు. LGBTQ ఉద్యమానికి వ్యతిరేకంగా నిలబడి, సత్యం కోసం తన స్వరాన్ని వినిపించాడు. కానీ, చార్లీ కర్క్ సత్యం బోధించడాన్ని సహించలేక ఒక యువకుడు ఆయనను కాల్చి చంపాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు విషయంలో కూడా ఇదే జరిగింది. ఆయన సత్య సువార్తను ప్రకటించినందుకే సిలువపై మరణించాల్సి వచ్చింది. తనన...

బిగ్ స్క్రీన్ పరిచర్య

  ఈ మధ్య కొంతమంది తమ్ముళ్లలతో మాట్లాడుతుంటే బయట జరుగుతున్న సంఘ కార్యక్రమాలను గురించి వారు చెప్పిన మాటలు నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేశాయి. ఒక సంఘ కాపరి, పరిచర్య నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లినప్పుడు తన స్థానిక సంఘంలో వేరే ప్రసంగీకుణ్ణి సిద్ధపర్చకుండా, ఎప్పుడో చెప్పిన ప్రసంగం వీడియో స్క్రీన్ మీద వేశారట. ఇలా చాలా సార్లు జరుగుతుందని కూడా వాళ్లు చెప్పినపుడు, ఆ సంఘ విశ్వాసుల ఆత్మీయ స్థితిని గురించి నాకు బాధేసింది.  ఆదిమ సంఘంలో నాయకులు సంఘంతో ఉన్నారు, సంఘానికి బోధించారు, సంఘాన్ని దేవుని వాక్యంతో కౌన్సిలింగ్ చేశారు. సంఘ చరిత్రలో కూడా నాయకులు ఇదే విధమైన పరిచర్య చేశారు. కానీ నేడు, పరిచర్యలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.  సంఘంలో వేరే నాయకుణ్ణి లేదా ప్రసంగీకుణ్ణి కూడా సిద్ధపరచని నాయకుడు, తన సంఘం మీద తానే నియంత్రణ కలిగుండాలి అనే తత్వాన్ని కలిగుండడమే అని నా అభిప్రాయం. ఆయన తప్ప ఎవరూ కూడా ఆ స్థానం తీసుకోవద్దు అనే ఆలోచనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోడానికి కారణం అవుతుంది.  సంఘముగా కూడినప్పుడు వినిపించబడే దేవుని వాక్యం, ముందుగానే రికార్డ్ చేసి, ఒక పెద్ద స్క్రీన్ మీద అందరికీ చూపించడం బహు...

కిడ్నీలో రాయి - క్రీస్తే మూలరాయి

మూడు రోజుల క్రితం నాకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. నేను డాక్టర్ అవ్వడం వలన, అది నా కిడ్నిలో గల రాళ్ల వలన వచ్చిందని కొంతవరకు నాకు అర్థమయ్యింది. వెంటనే కొన్ని ఇంజెక్షన్స్ తీసుకున్నాను. రెండు మూడు గంటల్లో  నొప్పి తగ్గింది.  మరుసటి రోజు CT SCAN చేయిస్తే ఒకవైపు మూత్రనాళంలో రాయి ఉందని తెలిసింది. 6-7mm పరిమాణం గల చిన్న రాయి నన్ను తీవ్రమైన నొప్పికి గురిచేసింది. ఆ సమయంలో ఒక చిన్న పిల్లాడిలా బెడ్ మీద అటు ఇటు దొర్లడం కూడా నాకు గుర్తుంది.   కడుపులో నొప్పి తగ్గగానే దేవుడు నా హృదయంలో పెట్టిన రెండు ఆలోచనలు ఏమిటంటే, ఒక చిన్న రాయి కలగజేసిన నొప్పికే నేను విలవిలలాడిపోయానే, ప్రభువైన క్రీస్తు ఆ సిలువలో నాకోసం ఎంతగా నొప్పిని భరించి ఉంటాడో కదా! నా పాప శిక్షను మోసిన క్రీస్తు అనుభవించిన నొప్పి వేదన ఎంత తీవ్రమైనదో కదా! అంతేకాదు, ఒక చిన్న రాయి నా శరీరంలో కలగజేసిన నొప్పికే నేను తట్టుకోలేకపోయాను. రక్షించబడకుండా నేను మరణిస్తే అగ్ని ఆరని పురుగు చావని నిత్య నరకంలో ఎప్పటికీ విపరీతమైన వేదన బాధతో ఉండిపోయేవాణ్ణి. నరకవేదన నుండి నన్ను తప్పించిన దేవుడు నా పట్ల చూపిన ప్రేమ ఎంత గొప్పదో కదా!  అందుకే కాబ...