Skip to main content

హుస్సేన్ సాగర్ దగ్గర..

ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రాకపోవడంతో జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవాలని హుస్సేన్ సాగర్ కి చేరుకున్నాడు కిరణ్. 
ప్రేమించినవాడు మోసం చేయడంతో జీవితం మీద విరక్తి చెంది చావాలని అదే హుస్సేన్ సాగర్ కి వచ్చింది సుధ.

ఇద్దరూ కాస్త దూరంలో నిల్చున్నారు. ఒకరికి ఒకరు పరిచయం లేదు. 
ఇద్దరూ నీళ్ల వైపు సీరియస్ గా చూస్తున్నారు.
ఇక దూకేద్దాం అనుకుని కిరణ్ రెడీ అవుతున్నాడు. ఇనుప రేలింగ్ ఎక్కే ప్రయత్నం చేస్తున్నాడు. 
ఎందుకో అటువైపు చూసిన సుధకి, కిరణ్ దూకబోతున్నాడని అర్థమయ్యింది.

పరుగున వచ్చి, ఏ అబ్బాయి ఏమైంది, ఎందుకు చావాలనుకుంటున్నావ్ ? అని అడిగింది.
ఉలిక్కి పడిన కిరణ్ దూకే ప్రయత్నం ఆపి నిలబడ్డాడు. 
విరక్తి ఈ జీవితం మీద విరక్తి అన్నాడు.

తను కూడా అదే ఆలోచనలో ఉన్న సంగతి పక్కన బెట్టి, జీవితం మీద విరక్తి పుడితే జీవితాన్ని ముగించమని ఎవరు చెప్పారు ? తనకు తాను చెప్పుకుంటూ కిరణ్ తో అనేసింది సుధ.
కష్టాలు, కన్నీళ్లు జీవితంలో కామన్. అసలు అవి లేకపోతే జీవితమే బోరింగ్ గా ఉంటుంది. నీకే కష్టం ఉందో నాకు తెలియదు కానీ, కాస్త ఓపిక పట్టు అన్నీ సర్దుకుంటాయేమో అంటూ చిన్న లెక్చర్ ఇచ్చేసింది. 

ఎవరో తెలియని అమ్మాయి ఇలా మంచి మాటలు చెబుతుంటే, కిరణ్ కి ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు.

నీకో విషయం చెప్పనా, నేను కూడా చావడానికే వచ్చాను. కానీ, ఈ హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్న ఇంతమంది జనాన్ని చూశాక, ఎందుకో అసలు ఎందుకు చావాలి అనే ప్రశ్న కలిగింది. వీళ్ళందరూ కష్టాలు లేని వాళ్ళు కాదు కదా ! ఏదో రకంగా ఇబ్బందుల గుండా వెళ్ళేవారే కదా ! మరి వీళ్ళందరూ ఎందుకు చావట్లేదు అనిపించింది. అందరూ చస్తే ఈ హుస్సేన్ సాగర్ లో శవాల గుట్టలు చూడాల్సి వస్తుందేమో. 

కిరణ్ కి కొంచెం కొంచెంగా జ్ఞానోదయం అవుతున్నట్లు అనిపిస్తోంది. కరెక్టే కదా, సమస్యలు ఉన్నవారు అందరూ చచ్చిపోతే అసలు ఈ భూమ్మీద మనిషి అనేవాడు ఉండడు కదా అనే అలోచన కాస్త గట్టిగానే తాకింది.

అతి కష్టంగా చాలా థాంక్స్ అండి. జాబ్ దొరకలేదని చావాలనుకున్నా, కానీ ఇప్పుడు బ్రతుకుతా.ఎవరికోసమో కాదు, నా కోసం, నా తల్లిదండ్రుల కోసం బ్రతికి చూపిస్తా. 
థాంక్యూ అనుకుంటూ కిరణ్ వెళ్తుంటే,
కళ్ళలో తిరుగుతున్న నీళ్ళని అదిమిపెట్టడం కష్టంగా ఉండడం వల్ల, చున్నీతో కన్నీటిని తుడుచుకుంటూ తాను కూడా బ్రతకడానికి బయలుదేరింది సుధ.

- డా.శంకర్ బాబు 

Comments

Popular posts from this blog

సత్యం కోసం నిలిచిన చార్లీ కర్క్

అమెరికాలో ఇటీవల చోటుచేసుకున్న ఒక విషాద సంఘటన, అందరి హృదయాలను కలిచివేసింది. చార్లీ కర్క్ అనే యవ్వనస్తున్ని, ఆయనకన్నా చిన్న వయసున్న మరొక యువకుడు అందరి ముందు ఒక సమావేశంలో కాల్చి చంపాడు. చార్లీ కర్క్ ఒక క్రైస్తవుడు. దేవుని వాక్యాన్ని విశ్వసించి, ఆచరించి, దేవుని కోసం జీవించాడు. వివిధ యూనివర్సిటీల్లో యువతతో సమావేశమై, వారికి జీవిత పాఠాలను బోధించాడు. దేవుని సత్యాలను స్పష్టంగా తెలియజేశాడు. యువకులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి, వారిని నిజమైన విశ్వాస మార్గంలో నడిపేందుకు కృషి చేశాడు. బైబిల్ వ్యతిరేకమైన సిద్ధాంతాలను, జీవన విధానాలను ధైర్యంగా ఖండించాడు. తన చిన్న వయసులోనే ఎంతోమంది అభిమానాన్ని గెలుచుకుని, యువతకు ఆదర్శంగా నిలిచాడు. కుటుంబ బాధ్యతలను నెరవేర్చుకుంటూనే సమాజంలో మార్పు కోసం శ్రమించాడు. అబార్షన్‌కు వ్యతిరేకంగా గళమెత్తాడు. LGBTQ ఉద్యమానికి వ్యతిరేకంగా నిలబడి, సత్యం కోసం తన స్వరాన్ని వినిపించాడు. కానీ, చార్లీ కర్క్ సత్యం బోధించడాన్ని సహించలేక ఒక యువకుడు ఆయనను కాల్చి చంపాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు విషయంలో కూడా ఇదే జరిగింది. ఆయన సత్య సువార్తను ప్రకటించినందుకే సిలువపై మరణించాల్సి వచ్చింది. తనన...

బిగ్ స్క్రీన్ పరిచర్య

  ఈ మధ్య కొంతమంది తమ్ముళ్లలతో మాట్లాడుతుంటే బయట జరుగుతున్న సంఘ కార్యక్రమాలను గురించి వారు చెప్పిన మాటలు నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేశాయి. ఒక సంఘ కాపరి, పరిచర్య నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లినప్పుడు తన స్థానిక సంఘంలో వేరే ప్రసంగీకుణ్ణి సిద్ధపర్చకుండా, ఎప్పుడో చెప్పిన ప్రసంగం వీడియో స్క్రీన్ మీద వేశారట. ఇలా చాలా సార్లు జరుగుతుందని కూడా వాళ్లు చెప్పినపుడు, ఆ సంఘ విశ్వాసుల ఆత్మీయ స్థితిని గురించి నాకు బాధేసింది.  ఆదిమ సంఘంలో నాయకులు సంఘంతో ఉన్నారు, సంఘానికి బోధించారు, సంఘాన్ని దేవుని వాక్యంతో కౌన్సిలింగ్ చేశారు. సంఘ చరిత్రలో కూడా నాయకులు ఇదే విధమైన పరిచర్య చేశారు. కానీ నేడు, పరిచర్యలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.  సంఘంలో వేరే నాయకుణ్ణి లేదా ప్రసంగీకుణ్ణి కూడా సిద్ధపరచని నాయకుడు, తన సంఘం మీద తానే నియంత్రణ కలిగుండాలి అనే తత్వాన్ని కలిగుండడమే అని నా అభిప్రాయం. ఆయన తప్ప ఎవరూ కూడా ఆ స్థానం తీసుకోవద్దు అనే ఆలోచనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోడానికి కారణం అవుతుంది.  సంఘముగా కూడినప్పుడు వినిపించబడే దేవుని వాక్యం, ముందుగానే రికార్డ్ చేసి, ఒక పెద్ద స్క్రీన్ మీద అందరికీ చూపించడం బహు...

కిడ్నీలో రాయి - క్రీస్తే మూలరాయి

మూడు రోజుల క్రితం నాకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. నేను డాక్టర్ అవ్వడం వలన, అది నా కిడ్నిలో గల రాళ్ల వలన వచ్చిందని కొంతవరకు నాకు అర్థమయ్యింది. వెంటనే కొన్ని ఇంజెక్షన్స్ తీసుకున్నాను. రెండు మూడు గంటల్లో  నొప్పి తగ్గింది.  మరుసటి రోజు CT SCAN చేయిస్తే ఒకవైపు మూత్రనాళంలో రాయి ఉందని తెలిసింది. 6-7mm పరిమాణం గల చిన్న రాయి నన్ను తీవ్రమైన నొప్పికి గురిచేసింది. ఆ సమయంలో ఒక చిన్న పిల్లాడిలా బెడ్ మీద అటు ఇటు దొర్లడం కూడా నాకు గుర్తుంది.   కడుపులో నొప్పి తగ్గగానే దేవుడు నా హృదయంలో పెట్టిన రెండు ఆలోచనలు ఏమిటంటే, ఒక చిన్న రాయి కలగజేసిన నొప్పికే నేను విలవిలలాడిపోయానే, ప్రభువైన క్రీస్తు ఆ సిలువలో నాకోసం ఎంతగా నొప్పిని భరించి ఉంటాడో కదా! నా పాప శిక్షను మోసిన క్రీస్తు అనుభవించిన నొప్పి వేదన ఎంత తీవ్రమైనదో కదా! అంతేకాదు, ఒక చిన్న రాయి నా శరీరంలో కలగజేసిన నొప్పికే నేను తట్టుకోలేకపోయాను. రక్షించబడకుండా నేను మరణిస్తే అగ్ని ఆరని పురుగు చావని నిత్య నరకంలో ఎప్పటికీ విపరీతమైన వేదన బాధతో ఉండిపోయేవాణ్ణి. నరకవేదన నుండి నన్ను తప్పించిన దేవుడు నా పట్ల చూపిన ప్రేమ ఎంత గొప్పదో కదా!  అందుకే కాబ...