Skip to main content

క్రైస్తవులు వైద్యుల సలహాలు, ఔషదాలు వాడొచ్చా ?

క్రైస్తవులు వారి అనారోగ్యం నిమిత్తం వైద్యుల
వద్దకు వెళ్లి, వారి వైద్యం తీసుకోవచ్చా ?
బైబిల్ గ్రంథం మందులు వాడకూడదని
బోధిస్తున్నదా ?
ఈ ప్రశ్నలు చాలా ముఖ్యమైనవి.
ఎందుకనగా క్రీస్తుని వెంబడిస్తున్న చాలా మంది
“దేవుడు స్వస్థపరుస్తాడు కాబట్టి నేను వైద్యం
చేయించుకోను” అని వాదిస్తుంటే,
అవిశ్వాసులు సైతం “మీ దేవుడు
బాగు చేస్తాడు కదా, మరెందుకు
డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నారని కూడా
ప్రశ్నిస్తుంటారు.


కావున దేవుని వాక్యం వీటి విషయమై ఏమి
బోధిస్తుందో తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం.
క్రైస్తవ జీవితానికి పునాదియైన వాక్యం నుండే
ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకునే
ప్రయత్నం చేద్దాం.
మొదటిగా ఈ లోకంలో వ్యాధులు,మరణం
అనునవి, పాపము వలన కలిగిన ఫలితాలని
లేఖనాలలో మనం చదువుతాం.
మనిషి తాను చేసిన పాప ఫలితంగా శారీరక
మరియు ఆత్మీయ మరణానికి లోనైనాడని
బైబిల్ మనకు బోధిస్తుంది.
అయితే లేఖనాలలో ఎక్కడా కూడా క్రైస్తవులు
వైద్యులవద్దకు వెళ్లకూడదని,
వైద్యాన్ని తీసుకోవద్దని రాయబడలేదు.
బైబిల్ చెప్పని విషయాలను, మన కల్పితాలతో
చెప్పడం సరియైనది కాదు.


కొన్ని వాక్యాలను తప్పుగా అర్థవివరణ చేసి,
అన్వయించుకోవడం వలన కొంత మంది
క్రైస్తవులు తమ వ్యాదులకై, వైద్యం
తీసుకోక మరణిస్తున్నారు.


ఆ వాక్యాలకు సరియైన అర్థ వివరణ
ఇచ్చే ప్రయత్నం చేద్దాం.


2దినవృత్తా 16:12వ వచనంలో “ఆసా తన
యేలుబడియందు ముప్పది తొమ్మిదవ
సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి
తాను బహుబాధపడినను దాని విషయములో
అతడు యెహోవా యొద్ద విచారణ చేయక
వైద్యులను పట్టుకొనెను” అని వ్రాయబడింది.
ఇక్కడ ఆసా వైద్యులను సంప్రదించడమనే
కారణం ముఖ్యమైనది కాదు కానీ,
తాను యెహోవా వద్ద తన జబ్బు కొరకై
విచారణ చేయకపోవడం
ప్రాముఖ్యమైనదని గమనించాలి.
ఈ వాక్యంలో పరీశీలించాల్సిన
విషయమేమిటంటే
పాతనిబంధన కాలంలో ప్రజలు వారి జబ్బు
నిమిత్తమై వైద్యుని వద్దకు వెళ్ళేవారు.
ఆసా, వైద్యుని ప్రథమంగా ఆశించి,
దేవుని నిర్లక్ష్యం చేసినాడని
మాత్రమే ఈ వాక్యం సెలవిస్తోంది.


ఆది 50:2 వచనంలో, యోసేపు తన
తండ్రియైన యాకోబు మరణించిన పిదప
తన తండ్రి శవమును సుగంధ ద్రవ్యములతో
సిద్ధపరచవలెనని
తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించెను గనుక
వైద్యులు ఇశ్రాయేలును సుగంధద్రవ్యములతో
సిద్ధపరిచిరి అని వ్రాయబడింది.
ఆ దినాలలో శవమును అప్పటికాలములో గల
సుగంధద్రవ్యములతో వైద్యుల సలహాలతో
పాతిపెట్టేవారు.   
ఈనాడు కూడా కొన్ని రసాయనాల ద్వారా
వైద్యపరంగా శవమును
కొన్ని రోజుల వరకు భద్రపరిచే సాంకేతికత
మనకు తెలిసిందే.


యెషయా 38:21 : యెషయా “ అంజూరపు
పండ్ల ముద్ద తీసుకొని
ఆ పుండుకు కట్టవలెను,
అప్పుడు అతడు బాగుపడునని చెప్పెను”.  
ఈ మాటలు హిజ్కియా తన మరణకరమైన రోగముతో
బాధ పడుతున్న సమయంలో దేవుడు
యెషయా ద్వారా వినిపించాడు.
పుండుకు కావాల్సిన విరుగుడు లేదా
ఔషదమును యెషయా ఇక్కడ
ప్రస్తావించినట్లు గమనించాలి.


నూతన నిబంధనలో గల లూకా సువార్త
మరియు అపొస్తలుల కార్యముల
గ్రంథకర్తయైన లూకా,వృత్తిరీత్యా వైద్యుడే.

లూకా 10:33-34 లో దొంగల చేతిలో చిక్కిన,
కొరప్రాణముతో ఉన్నవాడి దగ్గరికి
ఒక సమరయుడు వచ్చి, అతని మీద జాలి పడి,
నూనెయు ద్రాక్షా రసమును పోసి
అతని గాయములను కట్టి..అని వ్రాయబడింది.   
నూనె, ద్రాక్షా రసములో ఔషధ గుణములు
లేకపోతే, యేసుక్రీస్తు ప్రభువు వాటిని
తన ఉపమానములో
ఎందుకు ఉపయోగించాడు ?

అంతే కాక, “రోగులకే  గాని ఆరోగ్యము
గలవారికి వైద్యుడక్కరలేదని లూకా 5:31లో
ప్రభువు తన శిష్యులకు బోధించాడు.  

మార్కు 5:25-30 వచనాలలో రక్తస్రావం చేత
బాధపడుతున్న ఒక స్త్రీ,
యేసు వద్దకు రావడానికి ముందు అనేక
వైద్యుల వద్దకు వెళ్లినట్లు
మనము చదువుతాం.
తన సమస్యకు పరిష్కారం ఆ వైద్యుల వద్ద
దొరకనందున,
ఆమె యేసు వద్దకు వచ్చింది.


నూతన నిబంధన కాలంలో కూడా
వైద్యులున్నారనియు,
శరీర సంబంధ వ్యాధులకై చికిత్స నిమిత్తం
ప్రజలు వారి యొద్దకు వెళ్లేవారని
ఈ వాక్య భాగాలు స్పష్టముగా మనకు
బోధిస్తున్నాయి.


పై లేఖనాలను బట్టి ఒక విషయం అర్థమౌతుంది.


“ దేవుని వాక్యమైన బైబిల్ గ్రంథం
ఎక్కడా కూడా, వైద్యులను వారి
వైద్యమును, ఔషధాలను ఖండించడం లేదు”.  
అయితే దేవుని యందు విశ్వాసం,
స్వస్థపరచగలడనే నమ్మకం,
ఆయనపై ఆధారపడి ప్రార్థన చేయడం
ప్రాథమికంగా క్రైస్తవులు
ఆచరించవలసి ఉన్నది.
అదే విధముగా వైద్యులను సంప్రదించి వారి
సలహాలు సూచనలు మరియు చికిత్స
తీసుకోవడం కూడా మంచిదని విన్నవిస్తున్నాను.


కొందరు క్రైస్తవులు తాము చికిత్స తీసుకోవడం,
వైద్యానికి మందులు వాడడం వలన,
ఇతరులతో పోల్చుకుంటూ,
తమకు అల్ప విశ్వాసం ఉందని లేదా
లోపము గల విశ్వాసం ఉందని కూడా
బాధపడుతుంటారు. దీనికి ప్రధాన కారణం,
దేవునివాక్యపు లోతైన అవగాహన లేకపోవడమే.

కొంతవరకు ప్రాస్పరిటీ బోధకుల బోధ కూడా
ఇటువంటి వాక్య విరుద్ధ ఆలోచనలకు
బీజం పోస్తున్నాయి.
మీకు విశ్వాసం ఉంటే ఉపవాసం ఉండి
ప్రార్థన చేయండి,
లేదంటే నా దగ్గరికి రండి,నేను మీకై ప్రార్థిస్తాను,
దేవుడు స్వస్థపరుస్తాడు అని, విశ్వాసులలో
దేవునిపై వారికి గల నమ్మకాన్ని తగ్గిస్తున్నారు.
దేవుడు స్వస్థపరచగలడనే మాట సత్యమే కానీ,
దేవుడు కేవలం ఇదే విధంగా బాగుచేస్తాడని
మాత్రం చెప్పలేము.
ఆయన ద్వారా కలగజేయబడిన వైద్యము,
మందులు, కొన్ని ఆరోగ్య సంబంధ మార్పుల
వలన కూడా దేవుడు స్వస్థపరుస్తాడు.
మందులు వాడుతున్నాం కావున
అల్ప విశ్వాసులని,
వైద్య చికిత్స తీసుకొకపోతే అధిక విశ్వాసులని
చెప్పడం సరియైనది కాదు.


దేవుడిచ్చిన జ్ఞానముతోనే వైద్య శాస్త్రం
కొత్త పుంతలతో ముందుకు కొనసాగుతుంది.
దేవుని సహాయంతోనే  వైద్యులు తమ వంతు
ప్రయత్నం చేస్తూ చికిత్స చేస్తున్నారు.

చివరికి ఒకనాడు అందరమూ మరణిస్తాం కానీ
మన అజ్ఞానం వలన వైద్యచికిత్స
నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు.

Comments

Popular posts from this blog

సత్యం కోసం నిలిచిన చార్లీ కర్క్

అమెరికాలో ఇటీవల చోటుచేసుకున్న ఒక విషాద సంఘటన, అందరి హృదయాలను కలిచివేసింది. చార్లీ కర్క్ అనే యవ్వనస్తున్ని, ఆయనకన్నా చిన్న వయసున్న మరొక యువకుడు అందరి ముందు ఒక సమావేశంలో కాల్చి చంపాడు. చార్లీ కర్క్ ఒక క్రైస్తవుడు. దేవుని వాక్యాన్ని విశ్వసించి, ఆచరించి, దేవుని కోసం జీవించాడు. వివిధ యూనివర్సిటీల్లో యువతతో సమావేశమై, వారికి జీవిత పాఠాలను బోధించాడు. దేవుని సత్యాలను స్పష్టంగా తెలియజేశాడు. యువకులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి, వారిని నిజమైన విశ్వాస మార్గంలో నడిపేందుకు కృషి చేశాడు. బైబిల్ వ్యతిరేకమైన సిద్ధాంతాలను, జీవన విధానాలను ధైర్యంగా ఖండించాడు. తన చిన్న వయసులోనే ఎంతోమంది అభిమానాన్ని గెలుచుకుని, యువతకు ఆదర్శంగా నిలిచాడు. కుటుంబ బాధ్యతలను నెరవేర్చుకుంటూనే సమాజంలో మార్పు కోసం శ్రమించాడు. అబార్షన్‌కు వ్యతిరేకంగా గళమెత్తాడు. LGBTQ ఉద్యమానికి వ్యతిరేకంగా నిలబడి, సత్యం కోసం తన స్వరాన్ని వినిపించాడు. కానీ, చార్లీ కర్క్ సత్యం బోధించడాన్ని సహించలేక ఒక యువకుడు ఆయనను కాల్చి చంపాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు విషయంలో కూడా ఇదే జరిగింది. ఆయన సత్య సువార్తను ప్రకటించినందుకే సిలువపై మరణించాల్సి వచ్చింది. తనన...

సంఘముతో నిబంధన

క్రైస్తవులు వివాహం చేసుకునే సమయంలో ఒకరితో ఒకరు ప్రమాణాలు చేస్తారు. బైబిల్లో ఈ విధంగా ప్రమాణాలు చేయాలని లేకపోయినప్పటికీ, వివాహం చాలా ప్రాముఖ్యమైనదని, ఇలా నిబంధన చేయడం ద్వారా దానిలోకి అడుగేయాలని సూచనగా ఈ ప్రమాణాలను క్రైస్తవులు చేస్తారు.  అయితే, క్రైస్తవులు రక్షించబడిన తర్వాత దేవుని కుటుంబమైన సంఘములో చేర్చబడటం, వివాహము కన్నా ప్రాముఖ్యమైనది. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములో (అపోస్త 20:28) సభ్యులుగా ఉండడం ప్రతి క్రైస్తవుని బాధ్యతగా ఉంది. ఒక ప్రత్యేక సంఘానికి అంటుకట్టబడకుండా, సంఘానికి వేరుగా ఉండడం వాక్యానుసారమైన క్రైస్తవ్యం కాదు. అందుకే, సంఘములో చేర్చబడడం కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం.  సరదాగా రెండు మూడు గంటల కార్యక్రమానికి వచ్చినట్టుగా సంఘానికి వచ్చే క్రైస్తవులు నేటి దినాల్లో చాలామంది ఉన్నారు. సంఘము పట్ల తీవ్రమైన ఆసక్తి, సంఘానికి నిబద్ధత కలిగి లేకపోతే క్రీస్తు సారూప్యంలో ఎదగడం కష్టమే. సంఘముతో నిబంధన చేసి, సంఘాన్ని ప్రేమిస్తూ, దేవుడు ఇచ్చిన వరాలను సంఘక్షేమాభివృద్ధికి ఉపయోగిస్తూ క్రీస్తు కొరకు జీవించే, క్రీస్తును ప్రకటించే క్రైస్తవులుగా ఉండటానికి మనం పిలవబడ్డాం. సం...

Joy of parenting

  Apostle Paul, in his letter to the Galatians, wrote, “But the fruit of the Spirit is love, joy, peace, patience, kindness, goodness, faithfulness, gentleness, and self-control; against such things there is no law (Gal 5:22,23). A believer of Christ is called to bear the fruit of the Spirit, and one element in the fruit of the Spirit is joy. A follower of Christ is commanded to rejoice always (Phil 4:4). This joy of the Lord should be practiced in all areas of life.  One of the areas of practicing th is  Joy is in parenting. The writer of Proverbs says in Proverbs 23:24-25, “The father of the righteous will greatly rejoice; he who fathers a wise son will be glad in him. Let your father and mother be glad; let her who bore you rejoice”. Parenting our children is an outflow of how God parents us, because He is our heavenly Father. The Bible calls God the Father from whom all blessings flow to His children (James 1:17). Just as God delights when His children live by His sta...