హైదరాబాదులో నవంబర్ నెలలో జరిగిన
సంఘటన యావద్భారత దేశాన్ని కలిచివేసింది.
అంతకు ముందు కూడా ఎన్నో సార్లు
ఇటువంటివి జరిగినా, ఈసారి జరిగిన సంఘటన
వేగంగా దేశ వ్యాప్త చర్చకు దారి తీసింది.
అది డాII ప్రియాంక పై జరిగిన అత్యాచారం
మరియు ఆమె సజీవ దహనం.
అత్యంత దారుణంగా,కిరాతకంగా ఆ అమ్మాయిని
హత్య చేయడం ఎంతో మందిని బాధించింది.
ఆ నలుగురు కుర్రాళ్ళు చేసిన ఈ పైశాచికకార్యాన్ని
దేశమంతా ముక్త కంఠంతో ఖండించింది.
మనం కూడా ఇటువంటి చర్యలను
ఖండించాల్సిందే.
ఖండించాల్సిందే.
ఈ పని చేసిన వారిని తమకు అప్పగించమని,
వారిని మేమే చంపుతాం అని ప్రజలు
పోలీస్ స్టేషన్ ముట్టడించి ధర్నాలు చేయడం
కూడా మనందరికీ తెలిసిందే.
పోలీస్ స్టేషన్ ముట్టడించి ధర్నాలు చేయడం
కూడా మనందరికీ తెలిసిందే.
ఆ తర్వాత పోలీసుల కాల్పుల్లో ఆ నలుగురు
చనిపోవడం చూసి,వారు చేసిన పాపానికి
తగిన శిక్ష పడిందని ప్రజలు సంబరాలు
చేసుకున్నారు.
చేసుకున్నారు.
అవును,వారు చేసింది పాపమే,వారికి
శిక్ష పడాల్సిందే. ఎందుకంటే
ప్రతి తప్పుకు,పాపానికి శిక్ష తప్పనిసరి కాబట్టి.
శిక్ష పడాల్సిందే. ఎందుకంటే
ప్రతి తప్పుకు,పాపానికి శిక్ష తప్పనిసరి కాబట్టి.
అయితే, దయచేసి నన్ను కొన్ని ప్రశ్నలు
అడగనివ్వండి.
అడగనివ్వండి.
వ్యభిచారపు చూపుతో ప్రతి రోజు హృదయంలో
వ్యభిచారం చేస్తున్న వారికి పడాల్సిన శిక్ష ఏమిటి ?
అక్రమ సంబంధాలతో కుటుంబ సభ్యుల
హత్యలకు ఆత్మహత్యలకు కారణమవుతున్న
వారికి ఇవ్వాల్సిన శిక్ష ఏమిటి ?
హత్యలకు ఆత్మహత్యలకు కారణమవుతున్న
వారికి ఇవ్వాల్సిన శిక్ష ఏమిటి ?
పెళ్ళికి ముందే లైంగిక సంబంధాలు కలిగి
వ్యభిచరిస్తున్న టీనేజీ యువత పరిస్థితి ఏమిటి ?
అశ్లీల వీడియోలు,సినిమాలు చూస్తూ
పాపము చేస్తున్న యవ్వనస్తులకు రావాల్సిన
శిక్ష ఏమిటి?
అబద్ధాలాడుతూ, మోసంచేస్తూ, అన్యాయం,
అవినీతిలో అభివృద్ధిచెందుతున్నవారికి
పడాల్సిన శిక్ష ఏమిటి?
పడాల్సిన శిక్ష ఏమిటి?
ఎందుకంటే, చిన్నదైనా, పెద్దదైనా
పాపం పాపమే కదా.
పాపం పాపమే కదా.
ఆ కుర్రాళ్లు తప్పు చేసి దొరికారు అందుకే
మన దృష్టిలో వారు దుర్మార్గులయ్యారు.
మన దృష్టిలో వారు దుర్మార్గులయ్యారు.
ఎవరికీ దొరక్కుండా, కనబడకుండా మనం చేసే
పైన చెప్పబడిన తప్పుల సంగతేమిటి?
ఒకవేళ ఆ నలుగురు వారుచేసిన తప్పుకు
ఫలితం అనుభవిస్తుంటే, మన కన్నులతో,
ఆలోచనలతో పనులతో చేసే
ప్రతి తప్పుకు కూడా మనం శిక్షను
అనుభవించాల్సినవారమైయున్నాం.
ఆలోచనలతో పనులతో చేసే
ప్రతి తప్పుకు కూడా మనం శిక్షను
అనుభవించాల్సినవారమైయున్నాం.
ఏమిటా శిక్ష ?
మనిషి చేసే ప్రతి పాపము దేవునికి విరోధమైనది
కాబట్టి, దేవుడు పాపమును, పాపిని ద్వేషిస్తాడు
కాబట్టి, మనిషి దేవుని శిక్షకు పాత్రుడయ్యాడు.
కాబట్టి, దేవుడు పాపమును, పాపిని ద్వేషిస్తాడు
కాబట్టి, మనిషి దేవుని శిక్షకు పాత్రుడయ్యాడు.
దేవుడు స్వభావరీత్యా న్యాయవంతుడు కావున,
మనిషి యొక్క పాపమును బట్టి
శిక్షించువాడైయున్నాడు.
ఆ శిక్షనే చారిత్రక గ్రంథమైన బైబిల్
నరకముగా నిర్వచిస్తుంది.
ఈ లోకములో నేను ఏ తప్పుచేయలేను అని
చెప్పేవారు లేనే లేరు.
ఏ కులానికి చెందినా ఏ మతానికి చెందినా
ఏ ప్రాంతానికి చెందినా మనందరం పాప స్వభావం
కలిగి ఎదోరకంగా పాపము చేస్తున్నవారమే,
కలిగి ఎదోరకంగా పాపము చేస్తున్నవారమే,
మనకు రావాల్సిన శిక్షదేవుని ప్రమాణాల ప్రకారం
నిత్య నరకమే.
శిక్షను తప్పించేదెవరు ?
ఒకవేళ ప్రియాంకను చంపిన వారు పోలీసు
కాల్పుల్లో చనిపోకపోయినా, జీవిత ఖైదులుగా
లేదా ఉరిశిక్షకు పాత్రులుగా చేయబడేవారు.
కాల్పుల్లో చనిపోకపోయినా, జీవిత ఖైదులుగా
లేదా ఉరిశిక్షకు పాత్రులుగా చేయబడేవారు.
ఎందుకంటే, పాపానికి తగిన మూల్యం
చెల్లించాల్సిందే కాబట్టి.
చెల్లించాల్సిందే కాబట్టి.
మరి మన పాపములకు ఎవరు వెల చెల్లిస్తారు?
ఎవరు మనలను మన శిక్ష నుండి తప్పించగలరు?
ప్రతి మనిషి కూడా పాపానికి దాసుడే కాబట్టి
మన పాప ప్రాయశ్చిత్తం మరొక వ్యక్తి చెల్లించలేడు.
ఈ సమస్యను పరిష్కరించేదెవరు?
తననితాను రక్షించుకోలేని నిస్సహాయతలో ఉన్న
పాపులని రక్షించుటకు దేవుడు ఈ లోకమునకు
రావాల్సిన అవసరం ఏర్పడింది.
ఆ విధంగా దేవుడే మానవుడిగా రెండువేల
సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు.
ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు.
అంతే కాకుండా, వెల చెల్లించకుండా పాపముకు
విడుదల లేదు కనుక పాపులైన ప్రజల నిమిత్తం
యేసు క్రీస్తు ప్రభువు మరణానికి తనను తాను
అప్పచెప్పుకున్నాడు.
రక్తం చిందింపబడకుండా పాప క్షమాపణ లేదు
అనే మాటను నెరవేర్చేలా, సమస్త మానవాళి
పాప ప్రాయశ్చిత్తం కొరకు, యేసు క్రీస్తు ప్రభువు
తన ప్రాణము అర్పించాడు.
మానవ పాపములను వాటి ఫలితమైన
దేవుని ఉగ్రతను సిలువలో భరించి,
మానవ శిక్షను ఆయన అనుభవించాడు.
దేవుని ఉగ్రతను సిలువలో భరించి,
మానవ శిక్షను ఆయన అనుభవించాడు.
తనను నమ్మినవారిని , పాపమునుండి,
శాపము నుండి విడుదలనిచ్చుటకై
సిలువలో మరణించాడు.
అంతే కాక మూడవ దినమున మరణము
జయించి తిరిగి లేచాడు.
జయించి తిరిగి లేచాడు.
ఎవరైతే యేసుక్రీస్తు వద్దకు వచ్చి, తమ పాపాలు
ఒప్పుకొని, ప్రాయశ్చిత్త మనసుతో ఆయనయందు
ఒప్పుకొని, ప్రాయశ్చిత్త మనసుతో ఆయనయందు
విశ్వాసముంచుతారో వారిని నిత్యనరకము
నుండి, ఆత్మీయ మరణము నుండి రక్షించి,
నిత్య జీవము అనుగ్రహిస్తానని, తన వాక్యమైన
పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సెలవిచ్చాడు.
నుండి, ఆత్మీయ మరణము నుండి రక్షించి,
నిత్య జీవము అనుగ్రహిస్తానని, తన వాక్యమైన
పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సెలవిచ్చాడు.
ప్రియాంకను చంపిన ఆ నలుగురే కాదు,
పాపముతో మలినమైన తన ప్రజలందరినీ
రక్షించుటకు దేవుడు ఇష్టపడుతున్నాడు.
ప్రియ సోదరా, సోదరీ, నీ కొరకు మరణించిన
యేసును విశ్వసించు, నిత్య శిక్ష నుండి
విడిపించబడి నిత్యజీవముతో
నిత్య రాజ్యములో నివసించు.
విడిపించబడి నిత్యజీవముతో
నిత్య రాజ్యములో నివసించు.
Comments
Post a Comment