ఇన్ని బాధలు పడుతున్నాను,
ఎక్కడున్నావు దేవా?
ఇంతగా శ్రమలు నన్ను ఇబ్బంది
పెడుతున్నాయి,ఏమైపోయావు దేవా?
ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడో ఒకప్పుడు
మనందరం వేసినవారమే.
మన కష్టాల్లో మొదటిగా ప్రశ్నించేది దేవున్నే.
అంతా సాఫీగా సాగిపోతున్నపుడు
రాని ఈ ప్రశ్నలు,
శ్రమలు పలకరించగానే పుంఖాను పుంఖాలుగా
పుట్టుకొస్తుంటాయి.
కొందరు సూటిగా ప్రశ్నించక పోయినా
ప్రభువా, అసలు మా గూర్చి నీకు చింత లేదా
అనే మాటలను మాటి మాటికీ నెమరు వేస్తూ
కాలం వెళ్లదీస్తుంటారు.
కానీ, ఈ ప్రశ్నలకు బైబిల్ ఎప్పుడో జవాబులు
ఇచ్చేసింది. ఇక్కడ సమస్య
జవాబులు దొరక్క కాదు,
జవాబులను అంగీకరించి,
అన్వయించుకోకపోవడమే.
నిజమా అని మీరు ఆశ్చర్యపడేలోపు
మనుష్యులు శ్రమల్లో ఉన్నపుడు
దేవుడు ఎక్కడ ఉంటాడో,ఎక్కడ ఉన్నాడో
బైబిల్ నుండే చూపించే ప్రయత్నం చేస్తాను.
దానికంటే ముందు దేవునికి గల
ఒక ప్రాముఖ్యమైన గుణ లక్షణం గురించి
మాట్లాడుకుందాం.
దేవుడు ఆత్మ.అంటే ఆయనకు శరీరం
ఉండదు. ఈ ఆత్మ అయిన దేవుడు
అన్ని ప్రదేశాల్లో తన ఉనికిని పూర్తిగా
కలిగి ఉంటాడు.అందుకే దేవుడు
సర్వవ్యాపి అని అంటుంటారు.
సర్వవ్యాపి అయిన దేవుడు,
మనుష్యులు శ్రమల గుండా వెళ్లనప్పుడు
ఎక్కడ ఉంటాడో, అదే మనుష్యులు
శ్రమల గుండా వెళ్ళినపుడు కూడా
అక్కడే ఉంటాడు అనే విషయం ముందుగా
మన బుర్రల్లో గట్టిగా ఫిక్స్ చేసుకోవాలి.
సరే, ఇక బైబిల్లో కష్టాల గుండా వెళ్లిన ప్రజలను,
ఆ కష్టాల్లో దేవుడు ఎక్కడ వారిని పలకరించాడో
ఇప్పుడు చూద్దాం.
మొదటిగా, యోసేపును అడుగుదాం.
యోసేపు, నీ అన్నలే నిన్ను గుంటలో పడేశారు,
ఇష్మాయేలీయులకు అమ్మేశారు.
పోతీఫరు చేత చేయని తప్పుకు చెరసాలలో
పోతీఫరు చేత చేయని తప్పుకు చెరసాలలో
బంధింపబడ్డావు,
ఎన్నో కష్టాలు అనుభవించావు.
దేవుడెక్కడ అనే ప్రశ్న నీకు రాలేదా?
ఆది 39:20,21-యోసేపు చెరసాలలో ఉండెను,
అయితే యెహోవా యోసేపునకు
తోడైయుండెను అనే ఈ వచనం చూపించి,
నా శ్రమలలో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు
అని యోసేపు జవాబు చెప్తాడేమో.
రెండవదిగా, దానియేలుని ప్రశ్నిద్దాం.
అదేంటయ్యా, శ్రేష్టమైన బుద్ధి గలవాడవై
ప్రధానులలో ప్రఖ్యాతి గలవాడవై,
నమ్మకస్తుడవైన నిన్ను
సింహాల బోనులో పడేసారు కదా.
యెహోవా దేవా, నేనేం తప్పు చేశాను,
యెహోవా దేవా, నేనేం తప్పు చేశాను,
అసలు ఎక్కడున్నావు
అని ఎందుకు ప్రశ్నించలేదు అని
దానియేలుని అడుగుదాం.
ఆప్పుడు దానియేలు 6:22 నేను నా దేవుని
దృష్టికి నిర్దోషిగా కనబడ్డాను కాబట్టి ఆయన
తన దూతను పంపించి
సింహములు నాకు ఏ హాని చేయకుండా
వాటి నోళ్లు మూయించాడు,
అక్కడే ఆ సింహాల బోనులోనే దేవుడు
నాతో ఉన్నాడు అని మనకు జవాబిస్తాడేమో !
మూడవదిగా, యేసు క్రీస్తు శిష్యులను
అడుగుదాం.
మీరున్న దోనెమీద పెద్దతుఫాను రేగింది కదా,
మీరున్న దోనెమీద పెద్దతుఫాను రేగింది కదా,
ప్రభువా మీకు చింత లేదా అని
ప్రశ్నించారు కదా !
ఎక్కడున్నాడు దేవుడు ఆ సమయంలో ?
అప్పుడు,క్రీస్తు మాతో పాటు అదే దోనెలో
అప్పుడు,క్రీస్తు మాతో పాటు అదే దోనెలో
ఉన్నాడు,మేమే నమ్ముకలేక భయపడ్డాం,
దేవున్ని ప్రశ్నించాం అని మనకు శిష్యులు
హిత బోధ చేస్తారేమో (మార్కు 4:35-41)!
చివరిగా, ఈ ఇద్దరు పెద్ద మనుష్యులను కూడా
అడిగేద్దాం రండి.
హలో, పౌలు సీల సార్లు,అసలే చాలా
హలో, పౌలు సీల సార్లు,అసలే చాలా
దెబ్బలు తిన్నారు, కాళ్ళకు చేతులకు సంకెళ్లు వేసి,
కరెంటు లేని చీకటి గుహలో గల
చెరసాల్లో మిమ్మల్ని పడేశారు.
బాగా నొప్పి, జీవితం మీద నిరాశ,
చస్తే బాగుంటుంది అనే నిస్పృహ
ఇవన్నీ ఉండాల్సిన సమయంలో
వెరైటీగా పాటలు పాడుతూ,
దేవునికి ప్రార్థన చేశారట కదా!
అసలు ఎక్కడున్నావ్ దేవా,
ఇంతగా మేము బాధపడుతుంటే
నీకు పట్టట్లేదా అసలు నువ్వు మమ్మల్ని
ప్రేమిస్తున్నావా అని కదా ప్రశ్నించాలి.
అప్పుడు పౌలు సీలలు,
మీకింకా అర్థం కాలేదా,ఆ మధ్యరాత్రి వేళ,
ఆ చీకటి చెరసాలలో,
మా శ్రమల సంద్రంలో,అక్కడే దేవుడున్నాడు,
అందుకే మేము ఆయన్ను కీర్తించాం
ప్రార్థించాం
అని నవ్వుతూ జవాబిస్తారేమో
(అపోస్త 16:19-26) !
మన జీవితంలో శ్రమలు,మన పాపం వల్ల
(అపోస్త 16:19-26) !
మన జీవితంలో శ్రమలు,మన పాపం వల్ల
కలిగిన ఫలితాలు.
అవి మనతో ఉండాల్సిందే, మనం వాటితో
పయనించాల్సిందే.
శ్రమల ద్వారానే మనం సంపూర్ణతలోకి
ఎదుగుతాం,
సర్వాధికారియైన దేవునిపై ఇంకా
ఆధారపడతాం.
ఆ శ్రమలలోనే దేవుడు మనకు
తోడుగా ఉంటాడు.
ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము
మీతో కూడా ఉన్నాను (మత్తయి 28:20) అని
యేసు చెప్పిన మాటకి,
యుగ సమాప్తి వరకు మనకు కలిగే శ్రమలలో,
కష్టాలలో, కన్నీళ్లలో
దేవుడు తోడై ఉంటాడు అని అర్థం.
శ్రమలలో దేవున్ని ప్రశ్నించడం కాదు,
శ్రమలలో దేవున్ని ప్రశ్నించడం కాదు,
దేవున్ని స్తుతించడం నేర్చుకోవాలి.
Thank u anna
ReplyDeleteEncouraging thanks anna
ReplyDeleteExcellent answer anna
ReplyDelete