Skip to main content

Posts

Showing posts from October, 2018

పవిత్రమైన వివాహములో అపవిత్రమైన ఆచారం

వరకట్నం అనగా నేమి ? వివాహ విషయములో పెళ్లికుమారుని కుటుంబానికి, పెళ్లి కుమార్తెతో పాటుగా ఆమె  కుటుంబీకులు ఇచ్చే డబ్బు, వస్తు సంపదలను వరకట్నముగా నిర్వచిస్తారు. వివాహ శుభ  ఘడియకు ముందు ఈ కట్న కానుకల సంప్రదింపులు చాలా ముఖ్యమైనవిగా పరిగణించబడుతాయి. భారతదేశములో మొట్టమొదటిగా ఈ ఆచారము ఎప్పుడు మొదలైందో చెప్పడం కష్టమే. ఆ రోజుల్లో ఆడపిల్ల తండ్రి తన ఆస్తిలో కొంతభాగం బాధ్యతగా, కాబోయే పెళ్ళికూతురికి ఇచ్చేవాడు. తన కూతురు కొత్త ఇంటికి వెళ్తుందనే ఆలోచనతో ఆమెకు సహాయంగా డబ్బు, వస్తు సంపదను ఇష్టపూర్వకంగా ఇచ్చేవారు. కాలానుగుణంగా ఈ ఆచారము ఇష్టపూర్వకమైన కానుక నుండి దురాశతో నిండిపోయి డిమాండ్ చేసే స్థాయికి దిగజారిపోయింది. సమాజమును పట్టి పీడిస్తున్న సామాజిక దురాచారమైన వరకట్న వ్యవస్థను క్రైస్తవులు కూడా పాటించడం చాలా  బాధాకరం. కొందరు వరకట్నపు మూలాలను మరియు చరిత్రను ఎరుగకుండా, మరికొందరు డబ్బు మీద ఆశతో ఈ దురాచారాన్ని పాటిస్తున్నారు. క్రైస్తవ జీవితమునకు పునాదియైన బైబిల్ గ్రంథము దీనిని గూర్చి ఏమి  బోధిస్తుందో తెలుసుకోవాల్సిన అవసరతయున...

క్రైస్తవులు వైద్యుల సలహాలు, ఔషదాలు వాడొచ్చా ?

క్రైస్తవులు వారి అనారోగ్యం నిమిత్తం వైద్యుల వద్దకు వెళ్లి, వారి వైద్యం తీసుకోవచ్చా ? బైబిల్ గ్రంథం మందులు వాడకూడదని బోధిస్తున్నదా ? ఈ ప్రశ్నలు చాలా ముఖ్యమైనవి. ఎందుకనగా క్రీస్తుని వెంబడిస్తున్న చాలా మంది “దేవుడు స్వస్థపరుస్తాడు కాబట్టి నేను వైద్యం చేయించుకోను” అని వాదిస్తుంటే, అవిశ్వాసులు సైతం “మీ దేవుడు బాగు చేస్తాడు కదా, మరెందుకు డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నారని కూడా ప్రశ్నిస్తుంటారు. కావున దేవుని వాక్యం వీటి విషయమై ఏమి బోధిస్తుందో తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. క్రైస్తవ జీవితానికి పునాదియైన వాక్యం నుండే ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిగా ఈ లోకంలో వ్యాధులు,మరణం అనునవి, పాపము వలన కలిగిన ఫలితాలని లేఖనాలలో మనం చదువుతాం. మనిషి తాను చేసిన పాప ఫలితంగా శారీరక మరియు ఆత్మీయ మరణానికి లోనైనాడని బైబిల్ మనకు బోధిస్తుంది. అయితే లేఖనాలలో ఎక్కడా కూడా క్రైస్తవులు వైద్యులవద్దకు వెళ్లకూడదని, వైద్యాన్ని తీసుకోవద్దని రాయబడలేదు. బైబిల్ చెప్పని విషయాలను, మన కల్పితాలతో చెప్పడం సరియైనది కాదు. కొన్ని వాక్యాలను తప్పుగా అర్థవివరణ చేసి, అన్వ...

విస్మరించబడిన క్రీస్తు ఆజ్ఞ

ప్రభువైన యేసుక్రీస్తు, తన శిష్యులకు రెండు ఆజ్ఞలనిచ్చాడు. మార్కు సువార్త 12:30-31 వచనాలలో ఈ ఆజ్ఞలను మనం చదవగలం. మొదటిగా, “నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ వివేకముతోను,నీ పూర్ణ బలముతోను, నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలెను”. అనగా మన జీవితములో ప్రభువును ప్రేమించుటే అతి ప్రాముఖ్యమైన పనియై ఉన్నది. హృదయములో దేవునికి ప్రథమ స్థానం, బలహీనతలను ఎదిరించి ప్రభువుతో ప్రతిదినం సహవాసం, ఆయన రాజ్య వ్యాప్తికై సిద్ధపడి సువార్త పని మరియు శిష్యులను తర్ఫీదు చేయడం ఇవన్నీ ప్రధానమైన కర్తవ్యాలుగా ప్రతి క్రైస్తవుడు చేయవలసినవాడై యున్నాడు. దేవుని వాక్యమును ధ్యానిస్తూ, ఆయన గుణాలక్షణాలను కీర్తిస్తూ ప్రతిరోజూ ప్రభువును ప్రేమించుటకు మనం ప్రాథమికంగా పిలవబడినాము. దేవుడు మన పట్ల చూపిన అపార ప్రేమను బట్టి కృతజ్ఞతాపూర్వకముగా ఆయనను ప్రేమించుటయే క్రైస్తవ బాధ్యతయై యున్నది. చాలా మంది క్రైస్తవులు ఈ ఆజ్ఞను పాటించుటలో కొంత వరకు ప్రయత్నం చేస్తూ కొనసాగుతున్ననూ, క్రీస్తు ఆజ్ఞాపించిన మరో ఆజ్ఞను మాత్రం చాలా మట్టుకు నిర్లక్ష్యం చేయడం సంఘాలలో గమనించగలము. మార...