ఆదిమ సంఘములో,అంతా బాగుంది అనుకున్న సమయంలో, ఒక అలజడి రేగింది. అపోస్త 6 వ అధ్యాయంలో ఆ సమస్య తాలూకు సంగతులు మనం చదవగలం. గ్రీకు భాష మాట్లాడే యూదులు తమ విధవరాండ్రను నిర్లక్ష్యం చేస్తున్నారని హెబ్రీయుల మీద సణిగారు. ఈ వార్త అపోస్తలుల దగ్గరికి వెళ్ళింది. అప్పుడు వారు చాలా ప్రాముఖ్యమైన, సంఘానికి క్షేమభివృద్ధిని కలుగజేసే రెండు మాటలు చెప్పడం మనం చదువుతాము. మొదటిది, మీలో ఆత్మతో, జ్ఞానంతో నిండిన ఏడుగురు మనుషులను ఈ పనికి ఏర్పరుచుకోండి. రెండవది, అయితే మేము ప్రార్థనయందును వాక్యపరిచర్యయందును ఎడతెగక ఉంటాము అని చెప్పారు. సంఘము దేవుడు ఉద్దేశించిన విధంగా ఈ లోకంలో పరిచర్య చేయాలంటే, సంఘము క్షేమాభివృద్ధి చెందాలంటే ఈ రెండు విషయాలు చాలా ప్రాముఖ్యం. అన్నిపనులు సంఘ నాయకులు చేయకుండా,ఇతరులకు అప్పజెప్పడం మరియు ప్రాముఖ్యమైన పనులు సంఘ నాయకులు చేయడం. సంఘ నాయకులు చేసే ప్రాముఖ్యమైన పని ఏమిటి? సంఘము కోసం ప్రార్థన చేయడం మరియు సంఘాన్ని దేవునిలో పెంచి పోషించడానికి అవసరమైన దేవుని వాక్యాన్ని సరైన అర్థ వివరణతో బోధించడం. మిగతా పనులు సంఘ నాయకులు చేయకూడదని అర్థం కాదు గాని ఈ రెండు ప్రాముఖ్యమైన పనులు చేయకుండా వీటిని నిర్...