Skip to main content

Posts

Showing posts from September, 2018

వివాహేతర సంబంధం సరియైనదేనా ?

సెక్షన్ 377ను రద్దు చేసి స్వలింగ సంపర్కం నేరం కాదని తీర్పునిచ్చి  నెల రోజులు గడవకముందే భారత అత్యున్నత న్యాయస్థానం ఐపీసీ సెక్షన్ 497 ను కూడా కొట్టివేసి మరో సంచలన ప్రకటన చేసింది. ఐపీసీ 497లో “ మరోకరి భార్య అని తెలిసి, ఆ భర్త అనుమతి లేకుండా ఆమెతో శృంగారం అత్యాచార నేరం కాకపోయినా, వివాహేతర సంబంధించిన నేరం” అని వ్రాయబడింది.   ఈ చట్టం ప్రకారం  వివాహేతర సంబంధ నేరంగా పరిగణించి పురుషుడికి ఐదేళ్ల జైలు శిక్ష కానీ, జరిమానా కానీ లేదా రెండూ విధించేవారు. కానీ నేటి సుప్రీమ్ కోర్టు, ఈ చట్టాన్ని కొట్టివేసి వివాహేతర సంబంధం నేరం కాదు, అది మహిళల వ్యక్తిగత స్వేచ్ఛను హరించి, భార్యల హక్కులను కాలరాస్తుంది అని తీర్పునిచ్చింది. ఇష్టపూర్వక శృంగారం మహిళ హక్కు కావున ఈ విషయములో ఆమెకు షరతులు పెట్టలేమని స్పష్టం చేసింది. అంతే కాక దీనిని కారణంగా చూపి వివాహాన్ని రద్దుచేసుకోవచ్చని కూడా పేర్కొంది. ఈ సెక్షన్ 497 రద్దు వలన, వివాహ వ్యవస్థకు పెద్ద గాయమయ్యే అవకాశమున్నది. ఇప్పటికే వివాహేతర సంబంధాలు విజృంభించి ఎన్నో కుటుంబాలు విడిపోతున్న తరుణంలో ఈ తీర్పు భారత వివాహక్రమానికి మచ్చ తెచ్చేదే అని...

క్రైస్తవుడు, స్థానిక సంఘానికి అంటుకట్టబడి ఉండవలెనా ?

మొదటిగా నూతన నిబంధన, సంఘమును గూర్చి ఏమి బోధిస్తుందో చూద్దాం. సంఘమనగా,యేసుక్రీస్తు నందు విశ్వాసం ద్వారా , రక్షించబడిన వ్యక్తుల సమూహం. ఈ సంఘమును క్రీస్తు శరీరముగా బైబిల్ నిర్వచిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు, నా సంఘమును నేను కట్టెదను అనగా నా ప్రజలను నేను కట్టెదను అని బోధించాడు. ఆయన శిష్యులు అపోస్తలుల కార్యముల అధ్యాయములో ఆదిమ సంఘస్థాపన మరియు విస్తరణలో పాల్గొన్నారని మనకు తెలిసిందే. ఎక్కడెక్కడైతే సువార్త విత్తనం నాటబడిందో, ఆ ప్రదేశాలలో దేవుడు తన శిష్యులతో స్థానిక సంఘములను స్థాపించాడు. ఉదాహరణకు, థెస్సలొనిక  పట్టణముకు పౌలు వెళ్లి సువార్త బోధించిన పిదప (ఆపోస్త 17:1-3) అక్కడ సంఘము ఆవిర్భవించింది. పౌలు ఎఫెసీ పట్టణమునకు వచ్చి (అపోస్త 19:1-7) అక్కడ గల 12 మంది పురుషులతో సువార్త పంచుకొని ప్రార్థన చేసి వెళ్లిన తర్వాత అక్కడ సంఘముగా విశ్వాసులు కూడుకొనుట మొదలయింది. ఆ పిదప పౌలు వివిధ ప్రదేశాలలో గల “స్థానిక సంఘములకు” పత్రికలను పరిశుద్ధాత్మ ప్రేరేపణతో వ్రాసి  వాటిని మన ప్రోత్సాహం కొరకు బైబిల్ గ్రంథంలో అందించాడు. దేవుని ప్రణాళికలో  స్...

సంఘములో కులవ్యవస్థ

  కుల వ్యవస్థ ఆరంభం హిందూ పురాణాలలో మరియి ఇతర లేఖనాలలో, పురుష్ అనే వ్యక్తి శరీర భాగాల నుండి మనుష్యులు సృష్టించబడినారు అని వ్రాయబడింది. తల నుండి బ్రాహ్మణులు, ఉదరం మరియి భుజాల నుండి క్షత్రియులు, తొడ భాగం నుండి వైశ్యులు, కాలి  పాదము నుండి శూద్రులు సృజియించబడినారు. బ్రాహ్మణులు శిరస్సు నుండి వచ్చినవారు కావున జ్ఞానవంతులు మరియు పాండిత్యములో ప్రావీణ్యులు. భుజాల నుండి ఉద్భవించిన క్షత్రియులు పోరాటయోధులు మరియు బలాఢ్యులు. వైశ్యులు వ్యాపారములో విశిష్ఠులు. ఇక మిగిలింది శూద్రులు. వీళ్ళు కాలి పాదము నుండి వచ్చినవారై పైన గల మూడు జాతుల వారికి సేవ చేయడం వీరి పని. వీరి తర్వాత అంటరానివారు అనగా పంచములు అని పిలవబడే వారు సమాజంలో నీచమైన పనులనబడే చెత్త తీయడం,శవాలను పూడ్చడం, మలమూత్ర విసర్జకాలు కడగడం చేస్తారు. వీరిని దళితులు మరియు వెనకబడిన జాతులు అని పిలుస్తుంటారు. వీరిని కుక్కలకన్నా హీనంగా ఆ దినాల్లో చూసేవారు. ఈ విధమైన కుల వ్యవస్థ భారతదేశంలో వేల సంII ల క్రితం మొదలయ్యింది. బ్రాహ్మణులు మాత్రమే అధిక జ్ఞానముకై అర్హులు అనియు  శూద్రులు చదవడం, వ్రాయడం చేయక కేవలం మిగతా జాతుల వారికి ...